30, జూన్ 2012, శనివారం

మింగుడు పడని మాటలు


మింగుడు పడని మాటలు
                                  గీటురాయి 25-4-1986
       లోగుట్టులను బయటపెట్టే కులదీప్ నయ్యర్ ఈ మధ్య ముస్లిం సెక్యులర్ శక్తులు మూగనోము పట్టాయంటూఒకటే గోల చేస్తున్నాడు. ఆ గోలలో ఆయన పిడివాదులకు మింగుడుపడని కొన్ని లోగుట్టులు బయట పెట్టాడు.

 అవి ఏమిటంటే : -

          మరింత అల్లరి చేసినట్లయితే ప్రభుత్వం ముస్లిం స్త్రీల బిల్లును ఉపసంహరించుకుంటుందని  బిల్లును వ్యతిరేకించే వారు భావిస్తున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి తమ పలుకుబడిని పెంచుకోవడానికి హిందూ మతోన్మాదులు ఈ బిల్లును ఉపయోగించుకుంటున్నారు. చట్టం ప్రకారం హిందువులు ఒక భార్యను మాత్రమే కలిగి ఉండాలి. అయినా, హిందువులలో చాలా మందికి ఒకరికన్నా ఎక్కువ మండి భార్యలే ఉన్నారు. ముస్లిం జనాభా వార్షిక పెరుగుదల రేటు 2.4 శాతం కన్నా ఎక్కువ లేదు; ఇది దేశ జనాభా పెరుగుదల సగటు రేటు. ఈ సంధ్యను చాలా మండి హిందువులు విశ్వసించడం లేదు. అల్పసంఖ్యాక వర్గాల సంతృప్తి కలిగించటం అధిక సంఖ్యాక వర్గాల వారి భాద్యత. తాజ్ మహల్ మొదట ఒక దేవాలయమని విచిత్రంగా వాదించే ఉన్మాదపు హిందువులున్నారు. ఇలాంటి వాదనల వల్ల భయం హెచ్చుతుంది. బాబ్రీ మసీదు తాళం తీయడం వల్ల సాంప్రదాయక మాట సహనం దెబ్బతిన్నది.  సామరస్య పూర్వక రాజీ మార్గం అనుసరించకపోయినట్లయితేతీవ్ర ప్రమాదం సంభావిస్తుందనడానికి ఇదొక హెచ్చరిక.

ఈ హెచ్చరిక ఎవరికో పిడివాదులు చెప్పగలరా ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి