27, అక్టోబర్ 2012, శనివారం

పరహింసే పరమ ధర్మం



       పరహింసే పరమ ధర్మం
గీటురాయి      23-9-1988
                బాధే సౌఖ్యమనే భావన రానీ వోయ్
              ఆ ఎరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్        || జగ ||
             
              అంటాడు దేవదాసు. అందని ద్రాక్షపళ్ళు పుల్లన అనుకున్న నక్క     లాగ ! మత్తుమందులకు దాసులైపోయిన మనుషులు ఇలాంటి నిర్వీర్య     మైన భావాలకు లోనై మనో నిబ్బరం లేని వారై సంఘంలో కృంగి దర్శనమిస్తున్నారు. శక్తి చాలని వాడు సాధుత్వం వహించినట్లు, డబ్బులేని       వాడు దాతృత్వం గురించి ప్రసంగించినట్లు, కుదరని రోగం వచ్చినవాడు       దైవం వైపు మళ్ళినట్లు మా చెడ్డ అవకాశవాదులౌతున్నారు. ముఖాన తూ        అని మ్మేస్తే తుడుచుకుపోతున్నారు. సారాయి మానరా చవటా అంటే ఇదే       నా ఆనందానికి రాచబాట అన్నట్టు చివరికి జవాసత్వాలుడిగి, నరాలు    సళ్ళిచ్చి నవనాడులూ క్రుంగిపోయిన వేళ, చేతికి ఊతకర్ర తోడైన వే,     గతంలోని తమ మురికి జీవితాన్ని మరచి ధర్మపన్నాలు వల్లిస్తున్నారు.

              ముసలి వేశ్య పాతివ్రత్యాన్ని గురించి పలికినట్లు, నపుంసకుడు        బ్రహ్మచర్యమే మంచిదన్నట్లు, వార్ధక్యంలో వీరంతా సకల సద్గుణ       సంపన్నులుగా మనకు పరిచయం కాబోతారు. కానీ వాళ్ళ గత జీవిత     చిత్రాలు మన మెమరీలో ఉంటే ఒక్కసారి ఆ రీలు తిప్పుకోవచ్చు. అయ్యల ఘనత గుర్తు తెచ్చుకోవచ్చు.

              ఆనాటి దేవదాసు కొంతవరకు నయం. తన బాధేదో పరమానందం    అనుకొని తనలో తానే పరవశించి పోయ్యాడు. అసలు దేవదాసు అనేది ఎంత మంచి పేరో మనకు తెలుసు కానీ ఆ పేరు వినగానే తాగుబోతు    నాగన్నే గురుతు కొస్తున్నాడు. పేరు గుణనిధి పెను వేపవిత్తనం అన్నట్లుగా   ఆ పేరు విలువను పతనం చేసేవాళ్ళు సంఘం నిండా ఉన్నారు. సరే,        ఈనాటి దేవదాసులు, భంగు దాసులు, మందు దాసులు ఊహా లోకాల్లో     తేలిపోవటం లాంటి పిచ్చి పనులు చెయ్యకుండా పది మందిలోకి వచ్చి ప్రతి        బంధకం అవుతున్నారు. పిస్టల్స్ లాంటి ప్రమాదకరమైన వస్తువులు ప్రజల మీద ప్రయోగిస్తున్నారు. పోలీసులకు కూడా పాఠాలు నేర్పుతున్నారు.       పరహింసే పరమధర్మమంటున్నారు.

              మానాభిమానాలు మం గలిపి, పెద్దల సలహాను పెడచెవిని బెట్టి,    సాగినన్నాళ్ళు చెడదిరిగి, సాగని రోజున సాధు వేషాలతో సూక్తులు       చెబుతున్నారు. అర్ధ నిమీలిత నేత్రాలతో వైరాగ్య బోధ చేస్తున్నారు.

              ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఫ్రాన్స్ లో అలెన్ గ్రేసీయా అనే దుర్మార్గపు త్రాగుబోతు, మత్తు మందుల దాసుడు దాదాపు 120 మంది    స్త్రీలను మానభంగం చేశాడ. కొందరిని హత్య కూడా చేశాడ. చివరికి    పోలీసులకు చిక్కి కోర్టులో హాజరై అప్పుడెప్పుడో ఈ పాడు పనులు చేసిన    మాట నిజమే. ఇప్పుడు అలాంటి పనులు చేయలేనంత        ముసలివాడినయ్యాను. పైగా మారు మనస్సు పొందాను. ఇంకా నాకు       శిక్షేమిటి నారాయణా అంటూ నన్ను శేష జీవితం గడుపుకోనివ్వండి అని       కోర్టు పెద్దలకో ఉచిత సలహా విసిరిపారేశాడట. ఇతని మా నిజమేస్మీ అని     న్యాయవాదులు, న్యాయమూర్తులు తలలు పట్టుకొని న్యాయాన్ని బిగబట్టి ఉంచార. ఇక ఇప్పుడు చెప్పండి. ఇలాంటి దేవదాసుల్ని, కాదు కాదు        అలాంటి గ్రేసీయాలను ఏం చెయ్యాలో ?


      





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి